కిస్మిస్ పండ్లు మంచి పోషక ఆహార విలువలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమమైన ఆహారంగా ఉపయోగపడతాయి. రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ల వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిది.అయితే ఇవి కేవలం రుచికే కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ఔషధ పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉన్నాయి.
ముఖ్యంగా కిస్మిస్ పండ్లు తీసుకోవడం ద్వారా పొట్టలో ఎసిడిటి లాంటి సమస్యలు రాకుండా దూరం చేసుకోవచ్చు వీటిలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం ఉంటాయి ఇవి ఎముకలు మరియు దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ఎప్పుడు బద్ధకంగా నీరసంగా ఉండేవారు వీటిని తినడం ద్వారా యాక్టివ్ గా తయారవుతారు మరియు ఆరోగ్యవంతంగా మారతారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకి మరియు పెద్దవారు ప్పకుండా ఈ కిస్మిస్లు తీసుకోవడం ద్వారా నిత్యం ఆరోగ్యంగా ఉంటారు.
వీటివల్ల శరీరంలో రక్త సరఫరా అద్భుతంగా జరుగుతుంది మరియు రక్తం త్వరగా శుద్ధి చేస్తూ ఉంటుంది వాటితో పాటు చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది కంటి సంబంధిత రోగాలు ఉన్న వారు వీటిని తప్పక తీసుకుంటూ ఉండాలి ఇవి తినడం ద్వారా కంటి సంబంధిత సమస్యలు నయమవుతాయి.
సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలిగి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజు కిస్మిస్ పండ్లు తినడం వలన యూరినరీ సిస్టమ్లో అమోనియా పెరగకుండా, రాళ్లు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శృంగార శక్తిని పెంచే అమినో యాసిడ్ ఆర్జినిన్ ఇందులో ఉన్నది. ఇది శృంగార సమయంలో బలహీనత లేకుండా సమర్థవంతంగా పాల్గొనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
కిస్మిస్లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కంటి రోగాల నుంచి రక్షణనిస్తాయి.