జుట్టు రాలిపోవడం అనేది ఇప్పుడు సాధారణం అయిపోయింది. పెరుగుతున్న కాలుష్యం జుట్టు సమస్యకు ప్రధాన కారణం.జుట్టు రాలడం అరికట్టేందుకు ఈ చిట్కా ప్రయత్నించి చూడండి.
కావలసిన పదార్ధాలు
బియ్యం -1/4 కప్పు
మెంతులు -4 స్పూన్లు
ఆముదం. 1/4 స్పూన్
ముందుగా ఒక గిన్నెలో బియ్యం,మెంతులు పోసి ముందు రోజు నానబెట్టాలి. నానపెట్టిన బియ్యం, మెంతులను జార్ లో వేసి అందులో కొద్దిగా ఆముదం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిముషాలు తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయడంవలన జుట్టు రాలడం తగ్గుతుంది.జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.కొత్తగా కేశాలు వచ్చేందుకు కూడా ఈ మిశ్రమం దోహదపడుతుంది.
