HomeDevotionalదసరా నవరాత్రులలో 'మహిషాసురమర్దిని' గా అమ్మవారు-నైవేధ్యం , మంత్రం

దసరా నవరాత్రులలో ‘మహిషాసురమర్దిని’ గా అమ్మవారు-నైవేధ్యం , మంత్రం

శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది.ఇలా అమ్మవారికి అలంకరించే రూపాలు ప్రాంతాన్ని బట్టి , సంప్రదాయాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి .

తెలుగు రాష్ట్రాలలో అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గమ్మకి ఏరోజు ఏఅవతారాన్ని వేస్తే దానినే ప్రామాణికంగా ఇతర దేవాలయాలు , ప్రజలు అనుసరించడం జరుగుతుంది.
ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజును మహర్నవమిగా జరుపుకుంటాము. లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన అమ్మవారు (మహిషాసురమర్దిని)గా  మహోగ్రరూపం ధరించి ఉంటారు.

Mahishasuramardini

అమ్మవారు సింహమును వాహనంగా అధిష్టించి , ఆయుధాలను ధరించి సకల దేవతల అంశతో దివ్యమైన తేజస్సును కలిగి  భక్తులకు దర్శనం ఇస్తుంది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి.

ఈమె అనుగ్రహం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. ఈ రోజున చండీదేవిని పూజించిన వారికి శత్రుభయం ఉండదు.అన్నిటా విజయం కలుగుతుంది.

ఈ రోజు అమ్మవారిని పూజించి పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసం నైవేధ్యంగా సమర్పించాలి.

మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా,
జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ      శ్లోకాన్ని పఠించాలి.

See also  దసరా నవరాత్రులలో 'శ్రీ మహాలక్ష్మీ దేవి' గా అమ్మవారు, మంత్రం, నైవేద్యం
RELATED ARTICLES

Most Popular

Recent Comments