ప్రతి రోజూ గోరు వెచ్చని నీరు త్రాగితే రక్తప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది బ్లడ్ సర్కులేషన్ను పెంచుతుంది. ముఖ్యంగా బాడీఫ్యాట్ను కరిగిస్తుంది. అదే సమయంలో నాడీవ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
అలాగే క్రమం తప్పకుండా వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా శరీరాన్ని తేమగా, వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇది డ్రై, ఫ్లాకీ స్కిన్కు చాలా గొప్పగా సహాయపడుతుంది. శరీరం మొత్తంలో బ్లడ్ సర్కులేషన్ పెంచి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. హాట్ వాటర్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోపలి నుండి శుభ్రం చేస్తుంది.
దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు త్రాగడం ఒక గొప్ప నేచురల్ హోం రెమడీ. ఇది నిరంతరం వేధించే పొడి దగ్గును తగ్గించి.. శ్వాసనాళాన్ని తేలికచేసి, సరైన శ్వాస పీల్చుకొనేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతునిప్పిని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.